Asianet News TeluguAsianet News Telugu

కాకతీయ కెనాల్‌లో కారు బోల్తా:దంపతుల మృతి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వద్ద కారు అదుపుతప్పి కాకతీయ కెనాల్ లో కి తీసుకెళ్ళింది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వద్ద కారు అదుపుతప్పి కాకతీయ కెనాల్ లో కి తీసుకెళ్ళింది. ప్రమాదంలో లో భార్యభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన మాచర్ల శ్రీనివాస్ గౌడ్( 48) భార్య స్వప్న (45) గా గుర్తించారు పోలీసులు.సుల్తానాబాద్ నుండి శ్రీనివాస్, బార్య స్వప్న తో పాటు ఇద్దరు కొడుకులు కలిసి హొండా సిటీ కారులో హైదరాబాద్  వెళ్తుండగా అలుగునూర్ కెనాల్ వద్ద చాపలు కొనేందుకు కారును సైడ్ కు నిలిపారు. అంతలో కొడుకులు చాపలు తీసుకుంటుండగా తండ్రి శ్రీనివాస్ కారు రివర్స్ చేసే క్రమంలో అదుపుతప్పి కెనాల్ కాల్వలోకి దూసుకెళ్లింది.