బాలుడు సాయివర్ధన్ ను మింగేసిన బోరు బావి (చూడండి)
తెలంగాణలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు మరణించాడు.
తెలంగాణలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు మరణించాడు. బాలుడు సాయివర్ధన్ ను ప్రాణాలతో వెలికి తీయడానికి దాదాపు 12 గంటల పాటు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వి అతన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. 17 అడుగుల లోతు నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి.