Asianet News TeluguAsianet News Telugu

భారత్ బంద్: కరీంనగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ

 రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని నిర్వహిస్తున్న భారత్ బంద్ కరీంనగర్ లో ఉద్రిక్తతకు దారితీసింది.

 రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని నిర్వహిస్తున్న భారత్ బంద్ కరీంనగర్ లో ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని బస్టాండు ముందు టిఆర్ఎస్ నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి వాగ్వాదం చోటుచేసుకుంది.  బస్టాండు గేటు ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి నిరసన తెలుపుతుండగా టిఆర్ఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అక్కడికి రావడం వివాదానికి దారితీసింది. టిఆర్ఎస్ నాయకులని గో బ్యాక్ అని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకి గొడవ మొదలైంది. గోబ్యాక్ అని ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేస్తూ ఒకరిపైకి ఒకరు వెళ్లడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దు మనిగింది.