Asianet News TeluguAsianet News Telugu

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు తలను కొరికిన ఎలుగుబంట్లు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామంలో రాజిరెడ్డి అనే రైతు పొలానికి వెడుతుండగా, మూడు ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామంలో రాజిరెడ్డి అనే రైతు పొలానికి వెడుతుండగా, మూడు ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న గ్రామస్తులు గమనించి ఎలుగుబంట్లను తరిమేశారు. అప్పటికే ఆ రైతు తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికులు అతన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.