Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఆషాడమాస బోనాల సందడి షురూ... బంగారు బోనానికి మంత్రుల పూజ

హైదరాబాద్ : ఆషాడమాసం ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బోనాడ సందడి ప్రారంభమయ్యింది.

హైదరాబాద్ : ఆషాడమాసం ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బోనాడ సందడి ప్రారంభమయ్యింది. నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలకు గురువారం   దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,  మహమూద్ అలీ అంకురార్పణ చేసారు. లంగర్ హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు పూజలు నిర్వహించి తొట్టెలకు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుందని... ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.  అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.15కోట్లు కేటాయించిందన్నారు. అమ్మవారి ఆశిస్సులతో తెలంగాణ ప్రజానీకం సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.