Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ లేడీ ఎస్సై..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో  ఏసీబీ దాడులు నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో  ఏసీబీ దాడులు నిర్వహించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి వైన్స్ సమీపంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్సై సుస్మిత నిర్వాహకులను రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో 
నిర్వాహకులు కవ్వంపల్లి సురేష్, తిరుపతి, సంజీవ్ లు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో నేడు సిరిసిల్ల శివారులోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కానిస్టేబుల్ రాజు రూ. 20 వేలు లంచం డబ్బులు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. దీంతో ఎస్సై 
సుస్మిత, కానిస్టేబుల్ రాజులపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్ రాజు పరారీలో ఉన్నాడని ఏసీబీ డిఎస్పి భద్రయ్య మీడియాకు వెల్లడించారు.

Video Top Stories