Asianet News TeluguAsianet News Telugu

లంచం తీసుకుంటూ... ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏఎస్సై

కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి పోలీస్ ఏసిబికి చిక్కాడు.  

కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి పోలీస్ ఏసిబికి చిక్కాడు.  గంగాధర మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఎఎస్సై చంద్రారెడ్డి ఎసిబికి చిక్కాడు. మండలంలోని లింగంపల్లిలో రెండు వర్గాలు గొడపవడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఈ కేసు నిమిత్తం ఓ వర్గానికి చెందిన జుర్రు రాజమల్లు అనే వ్యక్తికి ఏఎస్సై లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతడు ఏసిబిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో  గంగాధర పోలీస్ స్టేషన్లో ఏఎస్సై పదిహేను వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.