Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలంలో ముగిసిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని గత 11 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని గత 11 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ అర్చకులు ఆదివారం పూర్ణాహుతితో ముగింపు పలికారు. 10వ రోజైన ఈ రోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహాదశీర్వచనం జరిపించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.