గాంధీ గారి మూడు కోతుల బొమ్మ... ట్రంప్ ఫిదా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. గాంధీ తిప్పిన రాట్నాన్ని ట్రంప్ దంపతులు తిప్పి చూశారు. రాట్నం గురించి ట్రంప్ దంపతులకు మోడీ వివరించారు. చెడు చూడొద్దు, చెడు మాట్లాడకూడదు, చెడు వినొద్దు అని గాంధీ సూక్తులను సూచించే మూడు కోతుల బొమ్మలను మోడీ ట్రంప్ దంపతులకు చూపించి వాటి గురించి వివరించారు.