527 మంది జవాన్ల ప్రాణత్యాగ ఫలితం... విజయ్ దివస్ (వీడియో)
సంప్రదాయ యుద్ధంలో మన్నలి గెలవలేమని భావించిన పాకిస్తాన్.. దొడ్డిదారిలో భారత్ను దెబ్బకొట్టాలని తరచుగా ప్రయత్నిస్తూనే ఉండేది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ ముష్కరుల్ని, సైన్నాన్ని మోహరించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ చొరబాటుదారుల్ని తరిమికొట్టేందుకు భారత సైన్యం 1999 మే 3న ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది.
సంప్రదాయ యుద్ధంలో మన్నలి గెలవలేమని భావించిన పాకిస్తాన్.. దొడ్డిదారిలో భారత్ను దెబ్బకొట్టాలని తరచుగా ప్రయత్నిస్తూనే ఉండేది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ ముష్కరుల్ని, సైన్నాన్ని మోహరించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ చొరబాటుదారుల్ని తరిమికొట్టేందుకు భారత సైన్యం 1999 మే 3న ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది.
గడ్డకట్టే చలిలో.. పూర్తిగా పర్వత ప్రాంతాల్లో.. ఏ మాత్రం సహకరించని వాతావరణంలో దాదాపు 60 రోజుల పాటు భారత సైన్యం పోరాడింది. జవాన్ల త్యాగాల ఫలితంగా జూలై 26, 1999న తిరిగి కార్గిల్ సెక్టార్ భారత వశమైంది. ఈ విజయానికి గుర్తుగా జూలై 26ను విజయ్ దివస్గా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు.