Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎలక్షన్స్ 2020 : ఓటు వేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ప్రెసిడెంట్ ఎస్టేట్ లోని రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాలు నిర్మన్ భవన్ లో తమ ఓటువేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఔరంగజేబ్ లేన్ లో ఓటు వేశారు. ఢిల్లీ బిజేపీ ప్రెసిడెంట్ మనోజ్ తివారి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.