Asianet News TeluguAsianet News Telugu

డిల్లీకి చేరిన 'బ్రో' వివాదం... విజయసాయి రెడ్డితో అంబటి భేటీ

న్యూడిల్లీ : పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.

న్యూడిల్లీ : పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించేందుకు పవన్ యత్నించారని మంత్రి అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా పవన్ కు చంద్రబాబు ప్యాకేజీ డబ్బులు అందాయని ఆరోపించారు. అందుకే ఈ సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన మంత్రి ఇందుకోసం ఇవాళ న్యూడిల్లీకి వెళ్లారు. డిల్లీలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసిన మంత్రి  రాంబాబు  దర్యాప్తు సంస్థలకు బ్రో సినిమాపై ఫిర్యాదు చేసారు.