Asianet News TeluguAsianet News Telugu

రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించిన భారత్

చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. 

చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. ఈ విషయంలో భారత్ అమెరికాను అధిగమించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలున్నాయి. దీని ప్రకారం 2019 లో భారతదేశంలో స్మార్ట్ఫోన్ ఎగుమతులు 7.7 శాతం పెరిగాయి. మొత్తంగా అమ్మకాలు 158 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయట. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ అమ్మాకాలు ఎక్కువగా జరిగాయట. దీనికి కారణం తక్కువ ధరలతో మధ్యతరగతికి అందుబాట్లో ఉండే చైనా బ్రాండ్లేనని, ఇవి గట్టిపోటీనిచ్చాయని తేలింది. ఇవే మార్కెట్ ఆధిపత్యానికి సహాయపడ్డాయి. 

Video Top Stories