Asianet News TeluguAsianet News Telugu

గ‌ణేష్ ఉత్స‌వాల‌తో జాతీయ చైత‌న్యాన్ని పెంపొందించిన ‘గంగాధరరావు బాలకృష్ణ దేశ్ పాండే’

గంగాధరరావు బాలకృష్ణ దేశ్ పాండేను కర్ణాటక కేసరి లేదా లయన్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తుంటారు.

గంగాధరరావు బాలకృష్ణ దేశ్ పాండేను కర్ణాటక కేసరి లేదా లయన్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తుంటారు. దేశ్ పాండే 1871 మార్చి 31 న బెల్గావి జిల్లాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. యువకుడిగా ఎదుగుతున్న సమయంలోనే స్వదేశీ ఉద్యమంలో చేరి బాలగంగాధర తిలక్ కు వీరాభిమాని అయ్యారు. తిలక్ ను స్ఫూర్తిగా తీసుకొని దేశపాండే జాతీయ చైతన్యాన్ని పెంపొందించడానికి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ పిలుపును పాటిస్తూ అణచివేతోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. గాంధీజీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ బెల్గాం సమావేశానికి దేశ్ పాండే ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నారు.గాంధీ మార్గాన్ని అనుసరించి దేశ్ పాండే బెల్గాం సమీపంలోని హుడాలి వద్ద కుమారి ఆశ్రమాన్ని స్థాపించారు. మైసూరు రాజ్యంలో మొట్టమొదటి ఖాదీ యూనిట్ ను అక్కడ ఏర్పాటు చేసి ఖాదీ భగీరధగా ప్రసిద్ధి చెందాడు. గాంధీ దండి మార్చ్ ద్వారా ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినప్పుడు.. దేశ్ పాండే మైసూరులో చట్టాలను ఉల్లంఘించడానికి నాయకత్వం వహించారు. దీంతో అరెస్టుకు గురయ్యాడు. 1937లో దేశ్ పాండే ఆహ్వానం మేరకు గాంధీజీ హుడాలీకి చేరుకుని ఏడు రోజుల పాటు అక్కడే బస చేశారు. దేశ్ పాండే క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఖైదీగా మారారు. గంగాధర్ రావు దేశ్ పాండే మైసూరులోని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులలో ఒకరిగా ఉన్నారు.