Asianet News TeluguAsianet News Telugu

హోలీ 2020 : రంగులు పూసుకుని, నిప్పులమీద నడిచి...నీళ్లలో మునిగి..పవిత్రస్నానాలతో..

దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి.

దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. యూపీ వారణాసిలో స్థానికులు నృత్యాలతో హోలీ పండుగ జరుపుకున్నారు. అమృత్ సర్, గోల్డెన్ టెంపుల్‌లో భక్తులు సరోవర్‌ హోలీ సందర్భంగా పవిత్ర స్నానాలు చేశారు. మధుర బాంకే బిహారీ ఆలయం రంగురంగుల కాన్వాస్‌గా మారింది. ఇక గుజరాత్ లోని సూరత్‌లో 'హోలిక దహన్' సందర్భంగా భక్తులు బొగ్గులను కాల్చారు. దహనం తరువాత నిప్పులమీద నడిచారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.