Asianet News TeluguAsianet News Telugu

దేశాన్ని మతపరంగా విభజించలేరు..కేంద్రంపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే

దేశాన్ని మతపరంగా విభజించలేరని బిజెపి ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి అన్నారు.
 

దేశాన్ని మతపరంగా విభజించలేరని బిజెపి ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి అన్నారు. కొత్త పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ ఆయన ఇలా స్పందించారు. మీరు రాజ్యాంగాని అనుసరించండి లేదంటే దాన్ని చింపేయండి. మనది లౌకికవాదానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం. దీన్ని మతపరంగా విభజించలేదు. అయినా కూడా దేశం మతపరంగా విభజించబడుతోంది. 
గ్రామాల్లోని ముస్లింలు ఇంకా అనుమానంగానే ఉన్నారు. మిగతావాళ్లతో ఈ విషయాలు మాట్లకుండా ఉంటున్నారు అని మైహార్ శాసనసభ్యుడు అన్నారు.