Asianet News TeluguAsianet News Telugu

పక్కా రాసిపెట్టుకోండి మళ్లీ మోదీనే

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కే కాదు ప్రతిపక్షాలకు కూడా అగ్నిపరీక్ష. 

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కే కాదు ప్రతిపక్షాలకు కూడా అగ్నిపరీక్ష. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు పెద్ద సవాల్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) కి   వ్యతిరేకంగా ఇండియా కూటమి పోటీ చేస్తోంది. ఇలా ఎన్నికల హడావిడి సాగుతున్న వేళ  ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ మెగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రతిపక్ష కూటమి తీవ్రమైన పోటీని ఎదుర్కోనుందని తేలింది. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశాన్ని మరింత వృద్దిపథంలో నడిపించగలవని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది.