Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్ లో ఘోరం... కొండచరియలు విరిగిపడి 55మంది జవాన్లు గల్లంతు, ఏడుగురు మృతి

ఇంపాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటయిన మణిపూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఆర్మీ జవాన్లతో పాటు కొందరు కార్మికులు గల్లంతయ్యారు.

ఇంపాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటయిన మణిపూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఆర్మీ జవాన్లతో పాటు కొందరు కార్మికులు గల్లంతయ్యారు. రిబామ్ నుండి ఇంపాల్ కు నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణానికి రక్షణగా నోని జిల్లాలోని తుపుల్ రైల్వేస్టేషన్ సమీపంలో 10మంది టెరిటోరియల్ ఆర్మీ జవాన్లను మోహరించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి 55మంది ఆర్మీ జవాన్లతో పాటు కార్మికులు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ మరియు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 13మందిని సురక్షితంగా కాపాడారు. ఏడు మృతదేహాలను బయటకు తీసారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.