Asianet News TeluguAsianet News Telugu

సినిమాకెళ్లి మోసపోయాం.. నిద్ర పోయాం భయ్యా.. వేస్ట్ అసలు

`మోసగాళ్లు` సినిమాకెళ్లి మేం మోసపోయాం. సెకండాఫ్ అంతా నిద్రపోయాను భయ్యా. సీరియస్‌గా బాగా లేదు` అని అంటున్నారు `మోసగాళ్లు` సినిమా చూసిన ఆడియెన్స్. 

`మోసగాళ్లు` సినిమాకెళ్లి మేం మోసపోయాం. సెకండాఫ్ అంతా నిద్రపోయాను భయ్యా. సీరియస్‌గా బాగా లేదు` అని అంటున్నారు `మోసగాళ్లు` సినిమా చూసిన ఆడియెన్స్. మంచు విష్ణు, కాజల్‌, సునీల్‌ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించిన చిత్రం `మోసగాళ్లు`. అతిపెద్ద ఐటీ స్కామ్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. నేడు(మార్చి 19)న సినిమా విడుదలైంది. సినిమా చూసిన ఆడియెన్స్ స్పందించారు. `సినిమాకెళ్లి మోసపోయామని అన్నారు. ట్యాగ్‌ అని, అదని, ఇదని ఏవేవో చెబుతుంటారు. సినిమాలో ఏం లేదు వేస్ట్. ఫస్టాఫ్‌ కే నిద్రొచ్చిందని, సెకండాఫ్‌లో కూల్‌ డ్రింక్‌ తాగుతూ టైమ్‌ పాస్‌ చేశామని అంటున్నారు. సినిమాలో ఏం లేదు. సునీల్‌ శెట్టి, కాజల్‌ ఇలా పెద్ద కాస్టింగ్‌ ఉందనుకుని వెళ్లాం. కానీ వెళ్లాక తెలిసిందే ఏం లేదని. హాలీవుడ్‌ రేంజా తొక్కా` అంటూ అసహనం వ్యక్తం చేశారు.