Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు శిరస్సు వంచి నమస్కారాలు: నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి (వీడియో)

రంజిత్ రెడ్డి వెంట మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీఆరెస్ ఎమ్మెల్యేలు, తామంతా కలిసి కట్టుగా రంజిత్ రెడ్డి ని గెలిపించుకుంటామని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువ అయ్యాయని ఆయన అన్నారు.

రంజిత్ రెడ్డి వెంట మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీఆరెస్ ఎమ్మెల్యేలు, తామంతా కలిసి కట్టుగా రంజిత్ రెడ్డి ని గెలిపించుకుంటామని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువ అయ్యాయని ఆయన అన్నారు. 

ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి టీఆరెస్ ద్వారా గెలిచి పార్టీ మారారని అన్నారు. ప్రజలు ఇలాంటి అంశాలను గమనిస్తున్నారని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు రంజిత్ రెడ్డి చెప్పారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ కి ధన్యవాదాలు చెప్పారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 

రంజిత్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి షేర్ లింగంపల్లి ఎమ్మేల్యే అరికేపూడి గాంధీ, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, కార్తీక్ రెడ్డి తో పాటు పలువురు కార్యకర్తలు, రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Video Top Stories