Asianet News TeluguAsianet News Telugu

నామినేషన్ దాఖలు: ఎమ్మెల్యే నడిపిన గులాబీ కారులో కవిత (వీడియో)

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్ కు వెళ్లారు. ఆ కారును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా నడిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెనక కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత నివాసం ముందు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానంతో పిలిపించుకున్న మహారాష్ట్రకు చెందిన డోలు కళాకారులు వాయిద్యాల హోరుతో సందడిగా మారింది.

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్ కు వెళ్లారు. ఆ కారును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా నడిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెనక కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత నివాసం ముందు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానంతో పిలిపించుకున్న మహారాష్ట్రకు చెందిన డోలు కళాకారులు వాయిద్యాల హోరుతో సందడిగా మారింది.

నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. జిల్లా, రాష్ట్ర అంశాలు అన్నింటినీ పార్లమెంట్ లో ప్రస్తావించానని ఆమె చెప్పారు. .హైకోర్టు విభజన, మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎట్లా  కొట్లాడామో ప్రజలు చూశారని అన్నారు. ఐదేళ్లలో తన పనితీరుకు మెచ్చి పార్టీ అధిష్టానం మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించిందని చెప్పారు. తనను మరో సారి గెలిపించి పార్లమెంట్ కు పంపాలని ఆమె కోరారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 16 కు16 ఎంపి స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, గులాబీ జెండా రెపరెపలాడించాలని అన్నారు. మేం గల్లీలో ప్రజలకుసేవకులమని, డిల్లీలో సైనికులమని ఎంపి కవిత మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో  రోడ్లు, భవనాలు, రవాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్,కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు బి గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ అమీర్, కె.విద్యాసాగర్ రావు,  డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత పాల్గొన్నారు.