Asianet News TeluguAsianet News Telugu

తప్పును బిజెపిపైకి నెట్టేసిన కల్వకుంట్ల కవిత (వీడియో)

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బిజెపి మాటతప్పిందని, భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ ఝూటా పార్టీ అని మేం చెప్పిందే నిజమైందని నిజామాబాద్ లోకసభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్మూరు సభలో బిజెపి నాయకుడు రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటు, రైతుల కష్టాలు గురించి తమకు తెలియదనీ తమ మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెడతామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఆర్మూర్ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.
 

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బిజెపి మాటతప్పిందని, భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ ఝూటా పార్టీ అని మేం చెప్పిందే నిజమైందని నిజామాబాద్ లోకసభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్మూరు సభలో బిజెపి నాయకుడు రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటు, రైతుల కష్టాలు గురించి తమకు తెలియదనీ తమ మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెడతామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఆర్మూర్ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.


చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని బిజెపి మేనిఫెస్టోలో పెట్టించాలని ఆమె రామ్ మాధవ్ ను సవాల్ చేసారు. కేంద్రంలో ఏర్పాటు అయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని, పసుపు బోర్డును తామే సాధిస్తామని ఆమె చెప్పారు. పసుపు రైతులకు మేలు చేస్తామని, ఎన్నికల కోడ్ ముగిశాక ఎర్ర జొన్న రైతులకు బోనస్ ఇస్తామని చెప్పారు.