Asianet News TeluguAsianet News Telugu

Video: స్కూటీపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్...కార్యకర్త కోసం

కరీంనగర్ ఎంపీ ప్రభుత్వం కల్పించే సెక్యూరిటీని వదులుకున్న తర్వాత మొదటిసారి బయటకు వచ్చాడు. ఎలాాంటి సెక్యూరిటీ లేకుండా ఓ కార్యకర్తను పరామర్శించడానికి హాస్పిటల్ కు వెళ్లారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓ సామాన్యవ్యక్తిలా ఎలాంటి భద్రత లేకుండానే ఓ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లారు. కరీంనగర్ సివిల్ హాస్పిటల్  కు స్కూటీపై చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్త ఆనంద్ ను పరామర్శించి యోగక్షేమాలను కనుకున్నాడు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అయితే ఎలాంటి భద్రత లేకుండా ద్విచక్రవాహనంపై వచ్చిన ఎంపీని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.