Asianet News TeluguAsianet News Telugu

నేను మోడీ కి పెద్ద ఫ్యాన్... భారత ప్రధాని తో భేటీ అనంతరం ఎలోన్ మస్క్..!

అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 

అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించబోతున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన సంభాషణ అని అన్నారు. వచ్చే ఏడాది ఇండియా వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాను అని చెప్పాడు. భవిష్యత్తులో భారత్ లో  తాను  చాలా ఉత్సాహంగా ఉన్నానని ఎలాన్ మస్క్ అన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాల కంటే భారతదేశానికి ఎక్కువ సామర్థ్యం ఉంది. భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నందున ప్రధాని మోడీ భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు. నేను మోదీ అభిమానిని. ఇది గొప్ప సమావేశం,  నేను అతనిని చాలా ఇష్టపడుతున్నాను. అని ఎలోన్ మస్క్ పేర్కొన్నారు.