Asianet News TeluguAsianet News Telugu

కేరళ ఏకైక పీసీసీ అధ్యక్షురాలు చునంగాట్ కున్హిక్కవమ్మ

స్వాతంత్య్ర భార‌తం 75 వార్షికొత్స‌వం జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ.. పురుషుల‌తో స‌మానంగా వారికి అవ‌కాశాలు అంద‌డం లేదు.

స్వాతంత్య్ర భార‌తం 75 వార్షికొత్స‌వం జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ.. పురుషుల‌తో స‌మానంగా వారికి అవ‌కాశాలు అంద‌డం లేదు. ఇక రాజకీయ పార్టీలపై పురుషుల ఆధిపత్యం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయితే, దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌పై స్ప‌ష్ట‌మైన పురుషాధిక్య‌త ఉన్న స‌మ‌యం అంటే.. 1938లోనే ఒక మహిళ పీసీసీ అధ్యక్షురాలైంది. కేరళ చరిత్రలో ఆమె ఏకైక మహిళా పీసీసీ అధ్యక్షురాలు. చరిత్రలో ఒక స‌రికొత్త అధ్య‌య‌నాన్ని లిఖించిన ఆమె చునంగాట్ కున్హిక్కవమ్మ (Chunangat Kunhikkavamma). ఆమె 1938లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. కేరళ మొదటి ముఖ్యమంత్రి, భారత కమ్యూనిస్టు ఉద్యమ నాయ‌కురాలు ఇఎంఎస్ నమదూద్రిపాద్ ఆ సంవత్సరం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సంస్థాగత ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సనాతన వర్గాన్ని యువ వామపక్షాలు ఓడించిన సమయం అది.కున్హిక్కవమ్మ 1894లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒట్టప్పలంలోని చునాంగట్‌లో సాంప్రదాయ నాయర్ కుటుంబంలో జన్మించింది. ఆమె 8వ తరగతి వరకు చదువుకుంది. ఆ కాలంలో సాధారణ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఆమె భర్త ఎంవి మాధవ మీనన్, ప్రగతిశీల భావాలు కలిగిన జాతీయవాది, గాంధీ అనుచరుడు. మీనన్ తన భార్యకు పెద్ద సంఖ్యలో పుస్తకాలు తెచ్చి చ‌ద‌వ‌మంటూ.. ఆమెను ప్రజా జీవితంలో చేరమని ప్రోత్సహించాడు. దీంతో ఆమె స్వాతంత్య్ర ఉద్య‌మంలో ముందుకు సాగారు. గాంధీజీ కేరళను సందర్శించినప్పుడు తన నగలన్నీ విరాళంగా  అందించి.. స్వాతంత్య్ర పోరాటం ప్ర‌త్యేక‌త చాటుకున్నారు. అలాగే, ఆమె ఖాదీ ధరించడం ప్రారంభించింది. 1921లో తన స్వస్థలమైన ఒట్టప్పలంలో జరిగిన KPCC మొదటి ఆల్ కేరళ రాజకీయ సదస్సు నిర్వాహకుల్లో ఆమె ఒకరుగా ఉండ‌టం విశేషం.  గాంధీ పిలుపు క్ర‌మంలో జాతీయ ఉద్యమంలో చేరిన మొదటి బ్యాచ్ మహిళల్లో ఆమె ఒకరు. విదేశీ వస్త్రాల బహిష్కరణలో పాల్గొన్నందుకు అరెస్టు అయ్యారు. సంప్రదాయ నాయర్ కుటుంబాలలో ఎన్నడూ లేని విధంగా ఆమె కన్నూర్ సెంట్రల్ జైలులో మూడేళ్లు గడిపారు. ఆమె విడుదలైన తర్వాత, తన కార్యకలాపాలను మ‌రింత చురుగ్గా కొన‌సాగించారు. మళ్లీ జైలుకెళ్లి వేలూరు జైలులో బంధించ‌బ‌డ్డారు. ఆమె జైలు సహచరులలో MV కుట్టిమలు అమ్మ వంటి మహిళా నాయకులు ఆమె రెండు నెలల పాప, గ్రేసీ ఆరోన్ మొదలైనవారు ఉన్నారు.  కున్హిక్కవమ్మ స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగి ఖాదీ, హరిజన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఆమె తన గ్రామంలో కస్తూర్బా మెమోరియల్ పాఠశాలను స్థాపించింది. ఆమె వినోభా భావే భూదాన్ ఉద్యమానికి 8 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. స్వాతంత్య్ర ఉద్య‌మంతో ఆమె తామ్రపత్రాన్ని అందుకున్నప్పటికీ, జాతీయోద్యమానికి ఆమె చేసిన సేవలకు ఉచితంగా లభించిన భూమిని స్వీకరించ‌కుండా సున్నితంగా  నిరాకరించింది. కున్హిక్కవమ్మ 1974లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.