Asianet News TeluguAsianet News Telugu

Video:అమరావతి కోసం... మరోసారి రోడ్డెక్కిన చంద్రబాబు

టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు రాజధాని కోసం మరోసారి రోడ్డెక్కారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు మద్దతుగా మరోసారి రోడ్డెక్కారు. ఇటీవల అమరావతి జేఏసి నిరసనల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ను కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చేశారు. అదే ప్రదేశంలో చంద్రబాబు నిరసనకు దిగారు. ఆయన వెంట భారీగా టిడిపి నాయకులు,  కార్యకర్తలు అక్కడకు చేరుకుంటున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.