Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 500 మందిపోలీసులు సామాజికదూరాన్ని పాటిస్తూ పాల్గొన్నారు.ఉదయం 6:15 గంటల నుండి 7:30గంటల వరకు ఈ యోగా కార్యక్రమం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి జి చంద్రమోహన్(పరిపాలన), ఏసిపిలు విజయసారధి,శ్రీనివాస్, ఎసిబిఐ ఇంద్రసేనారెడ్డి లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన అన్ని స్థాయిలకు చెందినపోలీసులు పాల్గొన్నారు
 

Video Top Stories