Asianet News TeluguAsianet News Telugu

Pratiroju Pandage : ప్రతీరోజూ పండగే చిత్రయూనిట్ బస్సు యాత్ర

సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’

సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. డిసెంబర్ 20న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకోసం చిత్ర బృందం ఆంధ్రాలో పర్యటించింది. ఏపీలోని భీమడోలు, తణుకు, ఏలూరు, కాకినాడ, రామచంద్రాపురంలకు ప్రతీరోజూపండగే బస్సు వెళ్లింది. అభిమానులను స్వయంగా కలవడానికే వచ్చానంటూ సాయిధరమ్ తేజ్ వారికి కృతజ్ఞతలు తెలిపాడు.