గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ దశను ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ దశను ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి ప్రారంభించారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీకరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం తనను ఇన్స్పైర్ చేసిందని ప్రభాస్ అన్నాడు. అందుకే వారి స్పూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా, శ్రద్ధా కపూర్లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు నామినేట్ చేశారు.