Asianet News TeluguAsianet News Telugu

సినిమా షూటింగ్‌ల‌కు సీఎం జగన్ అనుమతి.. అరగంటపాటు చర్చ..

ఏపీలోనూ సినిమా, టీవీ షూటింగులకు అనుమతి లభించినట్లు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. 

ఏపీలోనూ సినిమా, టీవీ షూటింగులకు అనుమతి లభించినట్లు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చిరంజీవి నేతృత్వంలోని బృందం మంగళవారం భేటీ అయింది. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జూన్ 15వ తేదీ నుంచి సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చారని, ఏపీలో సైతం అప్పటి నుంచే షూటింగులు చేసుకునేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి మంత్రి పేర్ని నానితో సమన్వయం చేసుకోవాలని సూచించారని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి సాధించేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. విశాఖలో దివంగత ముఖ్యమంత్రి కేటాయించిన 300 ఎకరాల్లో తిరిగి పునరుద్ధరిస్తామని, అందులో స్టూడియోలు, పరిశ్రమ వృద్ధి చెందేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు

Video Top Stories