ఓటిటి ప్రేక్షకులకు జాతిరత్నాలు ఎందుకు ఎక్కట్లేదు..?
మహా శివరాత్రి సందర్భంగా ఒకేరోజు మూడు సినిమాలు విడుదలయ్యాయి.
మహా శివరాత్రి సందర్భంగా ఒకేరోజు మూడు సినిమాలు విడుదలయ్యాయి.వాటిలో జాతి రత్నాలు ఒకటి. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే.. జాతిరత్నాలకే మంచి టాక్ వచ్చింది. సినిమా బాగుందన్నారు.కానీ ఈ స్దాయి హిట్ ని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత మెల్లిగా మౌత్ టాక్ పెరిగింది. తొలి రోజే.. మంచి వసూళ్లు రాబట్టింది. ఆదివారానికి బ్రేక్ ఈవెన్ లో పడింది. జాతి రత్నాలు జోరు మరో వారం రోజుల వరకూ ఉండే అవకాసం ఉందని లెక్కలువేసినవారి అంచనాలు తప్పాయి. ఈ సినిమా అదిరిపోయే లాభాలు సంపాదించింది. కేవలం 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో మూడు వారాల్లోనే 35 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఆ సక్సెస్ స్టోరీ ఓటీటి కు వచ్చేసరికి తిరగబడింది.