Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్న బాలు, వీడియో వైరల్

చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు రెండు నెలలుగా చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు రెండు నెలలుగా చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆగస్టు 5న ఎస్పీబీ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు బాలు ఆరోగ్యం విషమంగా ఉందని ప్రతిరోజూ మీడియాలో కథనాలు వచ్చేవి.

అయితే ఆగస్టు 28 నాటికి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం  కుదుటపడినట్లుగా తెలుస్తోంది. ఆయన స్వయంగా ఫిజియోథెరపి చేసుకుంటున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా వైద్య సిబ్బంది బాలసుబ్రమణ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిదన్న దానిపై క్లారిటీ రావాల్సి వుంది.