ధనుష్, శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం క్రేజీ అప్ డేట్స్
ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యిన సంగతి తెలిసిందే.
ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యిన సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ మాస్ గ్యాంగ్స్టర్ లుక్లో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ కోలీవుడ్ స్టార్ స్ట్రెయిట్ గా తెలుగులో చేయనున్న కొత్త ప్రాజెక్ట్ ఖరారు చేసారు. క్లాసిక్ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు శేఖర్కమ్ముల డైరెక్షన్లో ధనుష్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు.