Asianet News TeluguAsianet News Telugu

రూమర్స్ కి చెక్...ఎన్ఠీఆర్ ఫాన్స్ కి పండగే...

'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ పిలిచాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. 

'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ పిలిచాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ అల‌రించారు. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను అన్నారు.   ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఊరించారు. అయితే ఆ కలలన్నిటినీ కరోనా దెబ్బ కొట్టేసింది. దాంతో ఈ షో ను పూర్తి గా ఆపేసారని, ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జెస్ట్ అవటం కష్టమని వద్దనుకుంటున్నారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. వాటికి టీవి చానెల్ చెక్ పెట్టాలనుకుంది.  ఇదిలా ఉంటే తాజాగా జెమినీ టీవీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రోమో వదిలింది.