
సింహాద్రి అప్పన్న సన్నిధిలో బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ
విశాఖపట్నం: ఇవాళ (గురువారం) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వారిని టాలీవుడ్ హీరోయన్ మిత్ర శర్మ దర్శించుకున్నారు.
విశాఖపట్నం: ఇవాళ (గురువారం) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వారిని టాలీవుడ్ హీరోయన్ మిత్ర శర్మ దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి సింహాచలం చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా మిత్ర శర్మ సింహాచలం ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భగుడి వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ పర్యవేక్షకులు పాలూరి నరసింహారావు హీరోయిన మిత్ర శర్మకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source
