Asianet News TeluguAsianet News Telugu

ఆటో బోల్తా మహిళ మృతి, పలువురికి గాయాలు (వీడియో)

కర్నూల్ జిల్లా డోన్ మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కూలి పని నిమిత్తం వెళ్లి వస్తున్న ఆటో మార్గ మధ్యలో అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 

కర్నూల్ జిల్లా డోన్ స్థానిక మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి కూలి పని నిమిత్తం వెళ్లి వస్తున్న ఆటో మార్గ మధ్యలో అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది. లలిత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి, మృతి చెందిన మహిళను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం 15 మంది ప్రయాణికులు కనపకుంట గ్రామస్తులు గా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Video Top Stories