Asianet News TeluguAsianet News Telugu

video:తొట్లకొండలో పర్యాటకాభివృద్ధి... సాంస్కృతిక వారసత్వాన్ని కాపడతాం: మంత్రి అవంతి

తొట్లకొండలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న బౌద్ధ స్థూపాన్ని వెంటనే పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తొట్లకొండను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న  పురాతన స్థూపాన్ని...ఆ ప్రాంతం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.  

విశాఖపట్నం: తొట్లకొండలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న బౌద్ధ స్థూపాన్ని వెంటనే పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తొట్లకొండను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న  పురాతన స్థూపాన్ని...ఆ ప్రాంతం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. వెంటనే హైదరాబాదులోని సాంస్కృతిక, పురావస్తు శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. స్థూపం పునర్నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బౌద్ధులు నడయాడిన ప్రదేశాలున్న నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండడం... పురావస్తు, సాంస్కృతిక శాఖకు మంత్రిగా ఉండడం తన అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. తొట్లకొండను అభివృద్ధి చేసి ధ్యానం చేసుకునే స్థలంగా రూపొందిస్తామని మంత్రి అవంతి స్ఫష్టం  చేశారు. 

Video Top Stories