Video: చదువుకునే యువతకు శుభవార్త... మరో పథకాన్ని ప్రకటించిన జగన్
విద్యాదీవెన పథకాన్ని వచ్చేనెల పిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
విద్యా వసతి దీవెన పథకాన్ని ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభంచేసి మొదటి విడత పూర్తి చేస్తామని మళ్లీ జులై–ఆగస్టులో రెండో విడత నిర్వహిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
ఇందులో భాగంగా విద్యార్ధుల బోర్డింగు, లాడ్జింగు ఖర్చులకు డబ్బులను తల్లులకు ఇస్తున్నట్లు...దాదాపు 11 లక్షల మందికిపైగా పిల్లలకు ఇది ఇస్తామన్నారు.
జగనన్న విద్యా వసతి కింద ఐటిఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సుల విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలుఇవ్వనున్నట్లు తెలిపారు.