Asianet News TeluguAsianet News Telugu

భారీగా పట్టుబడ్డ నిషేధిత పదార్థాలు... (వీడియో)

లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లను మహానంది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న ఈ నిషేధిత పదార్ధాలు పోలీసుల అప్రమత్తతతో పట్టుబడ్డాయి.

కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద నిషేదిత గుట్కా ప్యాకేట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  రాయచూరు నుండి గుంటూరు కు తరలిస్తుండగా గాజులపల్లి మెట్ట వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. బోలెరో వాహనంలో తరలిస్తున్న ఈ నిషేదిత పదర్ధాలపై సమాచారం అందుకున్న మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో దాదాపు రూ.3,80,000/- విలువ గల నిషేధిత గుట్కా సంచులని పోలిసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Video Top Stories