ఇంటర్ విద్యార్థినిని బలితీసుకున్న ఒత్తిడి (వీడియో)
చదువు ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. కర్నూలులోని మాస్టర్ కాలేజ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న చందన ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక శ్రీరాంనగర్లోని తమ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది. ఆలస్యంగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
చదువు ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. కర్నూలులోని మాస్టర్ కాలేజ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న చందన ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక శ్రీరాంనగర్లోని తమ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది. ఆలస్యంగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.