Video: మండలి పరిణామాలపై ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ రాాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత కారణాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏపి శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ తణుకులో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వైసీపీ సభ్యులు ఆవేశపూరితంగా మాట్లాడారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. రాష్ట్రానికి మూడు రాజదానులు వుండాలా లేక ఒకటా అనే విషయంపై తానేమి కామెంట్ చేయబోనని అన్నారు. తనకున్న విశేష అధికారంతోనే వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లులపై సెలక్షన్ కమిటీకి సిపార్స్ చేసినట్లు తెలిపారు.