Asianet News TeluguAsianet News Telugu

చెన్నై ఐపిఎల్ జట్టులో సంక్షోభానికి కారణం ధోనీయే..

ఐపీల్ క్రికెట్ ఫీవర్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తుంది. 

ఐపీల్ క్రికెట్ ఫీవర్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తుంది. కరోనా నేపథ్యంలో జరుగుతోందో లేదో అనే అనుమానాల మధ్య మొత్తానికి సెప్టెంబర్ 19 నుండి మొదలుకానుంది. అయితే ఐపీఎల్ కు ముందే 13 మందికి కరోనా రావడంతో బయో సెక్యూర్ బబుల్ మీద అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాదు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్లు విజ్డెన్‌ టెస్టు సిరీస్‌ కోసం సుమారు 70 రోజులు బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌తో సిరీస్‌కు సైతం ఇంగ్లాండ్‌ నెల రోజులుగా బుడగలోనే ఉంటోంది. అయితే ఈ రెండు బబుల్స్ లో ఎక్కడా ఆందోళన కలిగించే సంఘటనలు చోటుచేసుకోలేదు. కానీ భారత్ కు వచ్చేసరికి మలింగా,  సురేష్ రైనా  ఐపీఎల్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ బయో సెక్యూర్ బబుల్ గురించి, కోవిద్ కేసుల గురించి.. చెబుతున్న ఆసక్తికర విశేషాలు..