సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణాలివే...
ఐపీఎల్ 2020లో హైదరాబాద్ బలహీనత మిడిల్ ఆర్డర్ కావచ్చనే అంచనాలు తొలి మ్యాచ్లోనే నిజమయ్యాయి.
ఐపీఎల్ 2020లో హైదరాబాద్ బలహీనత మిడిల్ ఆర్డర్ కావచ్చనే అంచనాలు తొలి మ్యాచ్లోనే నిజమయ్యాయి. ఆడుతూ పాడుతూ నెగ్గాల్సిన మ్యాచ్ను హైదరాబాద్ చేజేతులా ఓడింది. మిడిల్ ఆర్డర్లో యువ బ్యాట్స్మెన్ ప్రియాం గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మలు విఫలమయ్యారు. 121/2తో పటిష్టంగా ఉన్న హైదరాబాద్ను అద్భుత బౌలింగ్తో 153 పరుగులకే ఆలౌట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. డెవిడ్ వార్నర్ ఊహించని రనౌట్ తర్వాత నిలదొక్కుకున్న జానీ బెయిర్స్టో, మనీశ్ పాండేలు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ను ఎదుర్కొన్న తీరే ఓటమికి కారణమని చెప్పవచ్చు. దీని మీద ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి చెబుతున్న అనాలిసిస్ ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకం..