Asianet News TeluguAsianet News Telugu

మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న సిటీ ఫూట్ బాల్ గ్రూప్

 సిటీ ఫుట్‌బాల్ గ్రూప్ (సిఎఫ్‌జి) తన ఎనిమిదవ క్లబ్‌లో మెజారిటీ వాటాను పొందడానికి ఒప్పందాన్ని అంగీకరించింది. రిలయన్స్ ఫౌండేషన్, శ్రీమతి నీతా అంబానీతో కలిసి క్లబ్ అభిమానుల ముందు ఈ కొనుగోలు విషయాన్ని ఈ రోజు వెల్లడించారు. 

సిటీ ఫుట్‌బాల్ గ్రూప్ (సిఎఫ్‌జి) తన ఎనిమిదవ క్లబ్‌లో మెజారిటీ వాటాను పొందడానికి ఒప్పందాన్ని అంగీకరించింది. ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి, ఇండియన్ ఫుట్‌బాల్‌లో ఒక గొప్ప మార్పును సూచిస్తుంది. ప్రస్తుతం CFG క్లబ్ యొక్క 65% మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు అయితే  ప్రస్తుత వాటాదారులు హీరో , చిత్ర నిర్మాత రణబీర్ కపూర్ మరియు బిమల్ పరేఖ్ కలిసి మిగిలిన 35% వాటాలను కలిగి ఉన్నారు.ఈ వాటా కోసం పెట్టుబడి పూర్తి చేయడానికి కొన్ని ఫుట్‌బాల్ సంస్థల ఆమోదానికి లోబడి ఉంటుంది.CFG చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫెర్రాన్ సోరియానో, చైర్‌పర్సన్, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఫౌండేషన్, శ్రీమతి నీతా అంబానీతో కలిసి క్లబ్ అభిమానుల ముందు ఈ కొనుగోలు విషయాన్ని ఈ రోజు వెల్లడించారు.