Asianet News TeluguAsianet News Telugu

బాబు కోసం వంగవీటి రాధా యాగంలో నారా భువనేశ్వరి (వీడియో)

విజయవాడలో వంగవీటి రాధా నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ వంగవీటి రాధా ఈ యాగం నిర్వహించారు.

విజయవాడలో వంగవీటి రాధా నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ వంగవీటి రాధా ఈ యాగం నిర్వహించారు.

రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం, పవిత్ర నది జలాల సంరక్షణ కొరకు, ఆంధ్ర ప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడుమరోసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో విజయవాడ పిన్నమనేని 
పాలీ క్లినిక్  ఎదురు రోడ్డులో గల మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ లోని  కె.జె. గుప్తా కల్యాణమండపంలో యాగం నిర్వహించారు.   రిత్విక్ ల ఆధ్వర్యంలో  గత మూడు రోజులుగా ఈ యాగం జరిగింది. 

బుధవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు  నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పరిసమాప్తమైంది. భువనేశ్వరి భువనేశ్వరి గారు హాజరై యాగంలో పాల్గొన్నారు.