Asianet News TeluguAsianet News Telugu

పౌష్టికాహారంపై మంత్రి తానేటి వనిత సమీక్ష

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆర్జెడి, పిడిలతో పౌష్టికాహారం సరఫరా పై ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విశాఖపట్టణంలో సమీక్ష నిర్వహించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆర్జెడి, పిడిలతో పౌష్టికాహారం సరఫరా పై ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విశాఖపట్టణంలో సమీక్ష నిర్వహించారు . ప్రభుత్వం దీని కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే మనం దాన్ని సక్రమంగా అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. అధికారులు ఒకేచోట ఉండకుండా అన్ని ప్రాంతాలకు తిరిగి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.