సన్నిధి యాదవుల వారసత్వ హక్కు.. చంద్రబాబు రద్దు చేశాడు.. జగన్ తీర్మానం చేశాడు..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవుల ప్రతిష్టను పెంచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవుల ప్రతిష్టను పెంచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం, వారసత్వ హక్కును సన్నిధి యాదవులకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 1996లో చంద్రబాబు నాయుడు యాదవులకు ఉన్న వారసత్వ హక్కు ను రద్దు చేశారని పేర్కొన్నారు. యాదవులకు వారసత్వ హక్కును కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల రెండు రాష్ట్రాలలోని యాదవులంతా
హర్షిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ యాదవులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని, యనమల రామకృష్ణుడును తొత్తుగా పక్కన పెట్టుకోవడం తప్ప యాదవులకు చంద్రబాబు చేసిందేమీ లేదని ధ్వజ మెత్తారు. పాదయాత్రలో జగన్ యాదవులకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా నెరవేర్చారని చెప్పారు.