వైఎస్సార్ వర్ధంతి... తండ్రి సమాధి వద్ద పక్కపక్కనే కూర్చుని జగన్, షర్మిల నివాళి
కడప: దివంగత నేత వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ అక్కడే కాస్సేపు కూర్చున్నారు. ఏపీ డిప్యూటి సిఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి కూడా వైఎస్సార్ కు నివాళి అర్పించారు.
కడప: దివంగత నేత వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ అక్కడే కాస్సేపు కూర్చున్నారు. ఏపీ డిప్యూటి సిఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి కూడా వైఎస్సార్ కు నివాళి అర్పించారు.