Asianet News TeluguAsianet News Telugu

వైసిపి తణుకు ప్లీనరీలో రసాభాస... మంత్రి కారుమూరిని నిలదీసిన యూత్ ప్రెసిడెంట్

పశ్చిమ గోదావరి :  అధికార వైసిపి పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీని వచ్చేనెల జూలై  8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతోంది.

పశ్చిమ గోదావరి :  అధికార వైసిపి పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీని వచ్చేనెల జూలై  8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నియోజకవర్గస్థాయిలో ప్లీనరీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇలా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమురుని వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాక సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదంటూ వైసిపి కే చెందిన తణుకు యూత్ అధ్యక్షుడు మట్టా వెంకట్ మంత్రిని నిలదీయడంలో ప్లీనరీ రసాభాసగా మారింది. వెంటనే పోలీసులు వెంకటేశ్ ను ప్లీనరీ సమావేశం నుండి బయటకు తీసుకువచ్చారు.