Asianet News TeluguAsianet News Telugu

సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్.. ఏమంటున్నాడంటే...

కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో దొంతు బోయిన గోపి అనే యువకుడు  సెల్ టవర్ ఎక్కి  హల్ చల్ చేశాడు. 

కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో దొంతు బోయిన గోపి అనే యువకుడు  సెల్ టవర్ ఎక్కి  హల్ చల్ చేశాడు. తల్లిదండ్రులు లేని గోపి మేనమామ దగ్గర పెరిగాడు. గోపీ పేరుమీదున్న 33 సెంట్ల భూమిని ఇల్లు కట్టుకుని, పెళ్లి చేసుకుందామని అమ్మాడు. అయితే భూమికొన్న వ్యక్తి కొంత డబ్బుఇచ్చి మిగతాది ఇవ్వకుండా వేధిస్తున్నాడని, తొమ్మిదినెలలనుండి ఎదురుచూశానని గోపి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం జరగాలని లేకపోతే ఏదో ఒకటి చేసుకుని చచ్చపోతానని సెల్ టవర్ మీదినుండి వీడియో తీసి పంపాడు. గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Video Top Stories